రాజన్నసిరిసిల్ల : జాడలేని చిరుత ఆచూకీ

ABN , First Publish Date - 2021-01-14T13:16:59+05:30 IST

బోయినపల్లి మండలం మాల్కపూర్‌లోని చిరుత పులి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది.

రాజన్నసిరిసిల్ల : జాడలేని చిరుత ఆచూకీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి మండలం మాల్కపూర్‌లోని చిరుత పులి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. దానిని బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే బావిలో సొరంగం ఉండటంతో చిరుత ఆచూకీ తెలియలేదు. దీంతో హైదరాబాదు నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాత్రంతా బావివద్ద కాపలాగా ఉన్నారు. కాగా చిరుత కోసం బావిలోకి నిచ్చెనలు వేయడంతో అది పైకి వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో గంటలో బావిలోకి దిగి చూస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుత జాడ తెలియకుండా పోవడంతో మల్కాపూర్ గ్రామ ప్రజలు రాత్రి నుండి భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Updated Date - 2021-01-14T13:16:59+05:30 IST