డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్సింగ్
ABN , First Publish Date - 2021-09-03T15:36:32+05:30 IST
డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు రకుల్ప్రీత్ను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు రకుల్ప్రీత్ను ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 2, 3 ప్రకారం రకుల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆడిటర్లతో సహా ఈడీ విచారణకు రకుల్ ప్రీత్సింగ్ హాజరైంది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ ప్రశ్నించింది.