అసెంబ్లీకి టీడీపీ నేతల ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-01T09:13:20+05:30 IST

నివర్‌ తుఫానుతో పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు సోమవారం శాసనసభా

అసెంబ్లీకి టీడీపీ నేతల ర్యాలీ

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫానుతో పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు సోమవారం శాసనసభా సమావేశాలకు ర్యాలీగా తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించి, రబీ పెట్టుబడులకు ఆసరా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరద నీటిలో మునిగి, దెబ్బతిన్న ధాన్యం కంకులు, వరి పనలు, పత్తి మొక్కలు, ఇతర పంట ఉత్పత్తులను ప్రదర్శించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ నారా లోకేశ్‌, టీడీపీఎల్పీ ఉపనాయకులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, విప్‌ బాలవీరాంజనేయులు, మహిళా నేత ఆదిరెడ్డి భవాని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T09:13:20+05:30 IST