కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-01-14T23:26:13+05:30 IST

వేలాది మంది గుమికూడి కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా?: రామకృష్ణ

అమరావతి: వేలాది మంది గుమికూడి కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడిపందాలను అడ్డుకుంటామన్న ప్రభుత్వం చెప్పింది. కాని  ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పందాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఎన్నికలు జరపటానికి కరోనాను బూచిగా చూపిన ప్రభుత్వం కోడి పందాల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో కోళ్లకు కూడా కరోనా వచ్చేట్లున్నదని ఎద్దేవా చేశారు. పోలీసులు కోడిపందాల నిర్వాహకులతో లాలూచీ పడ్డారా అని ప్రశ్నించారు. వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-01-14T23:26:13+05:30 IST