భూవివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు
ABN , First Publish Date - 2021-03-05T18:17:37+05:30 IST
జిల్లాలోని శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో సొంత అన్నని తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు.
రంగారెడ్డి: జిల్లాలోని శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో సొంత అన్నని తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు. గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య(50), తమ్ముడు పాండు రాజుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం భూమి మధ్య గొడవ జరుగుతుండగా యాదయ్యపై పాండు.. శ్రీనివాసులు కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు.