రంగారెడ్డి: రాజేంద్రనగర్లో దారుణ హత్య
ABN , First Publish Date - 2021-04-08T15:55:40+05:30 IST
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. పశువుల మేత విషయంలో బాల్రాజ్, రమేష్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బాల్రాజ్ కొడవలితో రమేష్పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాల్రాజ్ గతంలో ఓ హత్యకేసులో నిందితుడుగా ఉన్నట్లు సమాచారం.