నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-26T21:49:37+05:30 IST

అప్పుడప్పుడు నేతలు మాట జారుతుంటారు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతుంటారు.

నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

రంగారెడ్డి: అప్పుడప్పుడు నేతలు మాట జారుతుంటారు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతుంటారు. తర్వాత పొరపాటును గుర్తించి నాలుక కరుచుకుంటారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నోరు జారారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సిందిపోయి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. దీంతో పక్కనున్నవాళ్లు గుర్తించి చెప్పడంతో మాట సరిచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తడబడ్డారు.

Updated Date - 2021-08-26T21:49:37+05:30 IST