రవికి పసిడి.. బజ్‌రంగ్‌కు రజతం

ABN , First Publish Date - 2021-04-18T05:51:50+05:30 IST

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం స్వర్ణం, రజతంతో పాటు మూడు కాంస్య పత కాలు దక్కాయి. 57 కిలోల ఫైనల్లో రవి దహియా 9-4తో అలీరెజా నోస్రాటొల్హా సర్లాక్‌ (ఇరాన్‌)పై గెలిచి పసిడి పతకం...

రవికి పసిడి.. బజ్‌రంగ్‌కు రజతం

ఆల్మాటీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం స్వర్ణం, రజతంతో పాటు మూడు కాంస్య పత కాలు దక్కాయి. 57 కిలోల ఫైనల్లో రవి దహియా 9-4తో అలీరెజా నోస్రాటొల్హా సర్లాక్‌ (ఇరాన్‌)పై గెలిచి పసిడి పతకం అందుకున్నాడు. 65 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన బజ్‌రంగ్‌ పూనియా.. కుడిభుజం గాయం కారణంగా బౌట్‌ నుంచి వైదొలిగి రజతంతో సరిపెట్టుకున్నాడు. కరణ్‌ (70 కి), పంచమ్‌ యాదవ్‌ (79 కి), సత్యవర్త్‌ కడియన్‌ (97 కి) కాంస్య పతకాలు సాధించారు.


Updated Date - 2021-04-18T05:51:50+05:30 IST