దళిత మహిళపై దాడి ఘటనపై ఆర్డీవో విచారణ

ABN , First Publish Date - 2020-06-01T23:28:15+05:30 IST

కోనఉప్పలపాడులో దళిత మహిళపై దాడి ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

దళిత మహిళపై దాడి ఘటనపై ఆర్డీవో విచారణ

అనంతపురం: జిల్లాలోని కోనఉప్పలపాడులో దళిత మహిళపై దాడి ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆర్డీవో కాళ్లపై పడ్డారు. ఈనెల 15న దళితమహిళపై శంకర్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు భయపడాల్సిన పనిలేదని అన్నారు.

Updated Date - 2020-06-01T23:28:15+05:30 IST