వైసీపీ మేనిఫెస్టోపై సజ్జల బహిరంగ చర్చకు సిద్ధమా?: దేవినేని

ABN , First Publish Date - 2020-06-02T00:55:02+05:30 IST

వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేశారు.

వైసీపీ మేనిఫెస్టోపై సజ్జల బహిరంగ చర్చకు సిద్ధమా?: దేవినేని

అమరావతి: వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను.. తాము చేశామని వైసీపీ జబ్జలు కొట్టుకుంటోందని చెప్పారు. పోలవరం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు. దమ్ము ధైర్మం ఉంటే సీఎం, మంత్రి సమాచారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పులిచింతల, వెలుగొండ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. బూతుల మంత్రులతో తిట్టించడం కాదని, సమాధానం కావాలన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలను పెట్టుకుని పోలవరంకు నిధులు తెచ్చుకోవడం చేతకాలేదని దేవినేని ఉమ ఎద్దేవాచేశారు.

Updated Date - 2020-06-02T00:55:02+05:30 IST