మచ్చబొల్లారంలో రీకౌంటింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T08:19:49+05:30 IST

మచ్చబొల్లారం డివిజన్‌ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ తాను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికన్నా ముందున్నప్పటికీ చివరకు 37 ఓట్లు తక్కువ

మచ్చబొల్లారంలో రీకౌంటింగ్‌ చేయాలి

హైకోర్టును ఆశ్రయిస్తానన్న బీజేపీ అభ్యర్థి సర్వే నరేష్‌ 

అల్వాల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మచ్చబొల్లారం డివిజన్‌ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ తాను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికన్నా ముందున్నప్పటికీ చివరకు 37 ఓట్లు తక్కువ వచ్చాయని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని బీజేపీ అభ్యర్థి సర్వే నరేష్‌ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ఫలితాల్లో అవకతవకలపై తాను హైకోర్టును ఆశ్రయిస్తున్నానన్నారు.


అధికారులు కుమ్మక్కై తన విజయాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం ఎలక్షన్‌ కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు.  


Updated Date - 2020-12-06T08:19:49+05:30 IST