సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
ABN , First Publish Date - 2021-10-07T00:37:01+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి బుధవారం వరద రాక తగ్గటంతో రెండు క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి బుధవారం వరద రాక తగ్గటంతో రెండు క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.70 అడుగులు(311.1486టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 4,679 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి 15,712 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, రెండు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,138 క్యూసెక్కులు మొత్తంగా సాగర్ నుంచి 46,733 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,676 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 882.20 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 75,789క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.