విజ్ఞాన్ వీశాట్ ఫేజ్-1 ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-06-24T08:47:13+05:30 IST
విజ్ఞాన్ విశ్వవిద్యాలయం(వడ్లమూడి, గుంటూరు)లో బీటెక్, బీ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించిన వీశాట్ 2021 ఫేజ్- 1 ఫలితాలను వీసీ ఎంవైఎస్ ప్రసాద్ బుధవారం విడుదల చేశారు
గుంటూరు(విద్య), జూన్ 23: విజ్ఞాన్ విశ్వవిద్యాలయం(వడ్లమూడి, గుంటూరు)లో బీటెక్, బీ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించిన వీశాట్ 2021 ఫేజ్- 1 ఫలితాలను వీసీ ఎంవైఎస్ ప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారన్నారు. అడ్మిషన్లలో వీశాట్లో ర్యాంకులతోపాటు, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. వీశాట్లో 1 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75ు స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు. 100 నుంచి 200లోపు ర్యాంకులు సాఽధించి న వారికి 50ు, 201 నుంచి 400లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 401 నుంచి 2వేలలోపు ర్యాంకులు సాధించిన వారికి 10ు స్కాలర్షిప్ అందిస్తామన్నారు. వీశాట్ ఫలితాలను ఠీఠీఠీ.ఠిజీజుఽ్చుఽ.్చఛి.జీుఽ అనే వెబ్సైట్లో చూడవచ్చునని తెలిపారు. విశాట్ ఫేజ్2 ప్రవేశ పరీక్షను జూన్ 23 నుంచి జూలై 25వ తేదీ మధ్య నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.