విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న జగన్: టీఎన్ఎస్ఎఫ్ నేత

ABN , First Publish Date - 2021-10-30T17:27:36+05:30 IST

విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపడ్డారు.

విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న జగన్: టీఎన్ఎస్ఎఫ్ నేత

విజయవాడ: విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ని దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పటిష్ఠం చేయాలో తెలియకుండా, వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్థుల భవిష్యత్తులో వెలుగులు నింపే పాఠశాలలు మూసేయడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్‌రెడ్డి మూసేయాల్సింది పాఠశాలలు కాదు.. మద్యం దుకాణాలు, పేకాట క్లబ్‌లని రేపాకుల శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2021-10-30T17:27:36+05:30 IST