గంటన్నరలో నలుగురిని హతమార్చి నేరుగా ఎక్కడికి వెళ్లాడంటే..!

ABN , First Publish Date - 2021-08-25T21:20:40+05:30 IST

నిందితుడు రావు రాయి సింగ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. బాదితులు సునిత యాదవ్, క్రిష్ణన్ తివారి, క్రిష్ణన్ భార్య అనామిక తివారి అని వెల్లడించారు. వీరిని హతమార్చడానికి నిందితుడు మొక్కలను కత్తిరించే కత్తిని ఉపయోగించినట్లు పోలీసులు

గంటన్నరలో నలుగురిని హతమార్చి నేరుగా ఎక్కడికి వెళ్లాడంటే..!

గురుగ్రామ్: ఓ ఆర్మీ మాజీ అధికారి తన కోడలితో పాటు అద్దెకు ఉంటున్న కుటుంబంలో ముగ్గురిని గంటన్నరలో హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో మంగళవారం ఉదయం జరిగిందీ దారుణం. తన కోడలితో పాటు అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి, అతడి భార్య, తొమ్మిదేళ్ల కూతురిని పదునైన ఆయుధంతో చంపాడు. అయితే దాడి చేసే సమయంలో మృతుడి చిన్న కూతురు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమెపై కూడా నిందితుడు దాడికి దిగాడు. కాకపోతే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స పొందుతోంది.


నిందితుడు రావు రాయి సింగ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. మృతులు సునిత యాదవ్, క్రిష్ణన్ తివారి, క్రిష్ణన్ భార్య అనామిక తివారి అని వెల్లడించారు. వీరిని హతమార్చడానికి నిందితుడు మొక్కలను కత్తిరించే కత్తిని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంటి తలుపులకు ముందుగా బోల్ట్‌లు బిగించాడు. అనంతరం తన కోడలిని చంపేసి, అక్కడి నుంచి తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న క్రిష్ణన్‌ గదిలోకి వెళ్లి అతడిని చంపాడు. అనంతరం అతడి భార్య, కూతురిని చంపేశాడు. క్రిష్ణన్‌తో తన కోడలు శారీరక సంబంధం పెట్టుకుందనే కారణంతో ఈ హత్యలు చేసినట్లు పోలీస్ స్టేషన్ ముందు నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-25T21:20:40+05:30 IST