సెప్టెంబరు 12, 13 తేదీల్లో ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-08-13T12:14:16+05:30 IST
సెప్టెంబరు 12, 13 తేదీల్లో ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్ష
అమరావతి: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (డెహ్రాడూన్) ప్రవేశ పరీక్ష ఈ ఏడాది సెప్టెంబరు 12, 13 తేదీల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు సెప్టెంబరు 5లోగా స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు.