ధోనీ సాధించలేకపోయాడు.. రిషభ్ పంత్ సాధించాడు!

ABN , First Publish Date - 2021-05-07T16:01:40+05:30 IST

టీమిండియా వికెట్ కీపర్, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.

ధోనీ సాధించలేకపోయాడు.. రిషభ్ పంత్ సాధించాడు!

టీమిండియా వికెట్ కీపర్, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. భారత్‌ తరఫున ఇప్పటివరకు ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరు ఈ జాబితాలో టాప్ టెన్‌లోకి రాలేకపోయారు. 


టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న టీమిండియా తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్‌కు దక్కడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇక, ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ పంత్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. 

Updated Date - 2021-05-07T16:01:40+05:30 IST