వలస కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ
ABN , First Publish Date - 2020-05-31T13:38:50+05:30 IST
జిల్లాలోని నకిరేకల్ ఇనుపాముల బైపాస్రోడ్డులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ ఇనుపాముల బైపాస్రోడ్డులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 8మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.