కారు బోల్తా..నలుగురు మృతి
ABN , First Publish Date - 2020-12-09T19:46:52+05:30 IST
కారు బోల్తా..నలుగురు మృతి
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్లలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు బోల్తాపడ్డ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రాయచూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు శారద, గోవిందమ్మ, హారిక, ఎల్లయ్యలు బడంగ్పేట్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.