అతివేగం..ఆపై అజాగ్రత్త

ABN , First Publish Date - 2021-01-14T07:57:08+05:30 IST

విహారయాత్ర విషాదాంతమైంది. ముగ్గురి సరదా మూడు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ద్విచక్ర వాహనంపై సరదాగా మెదక్‌ నుంచి బయలుదేరి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి

అతివేగం..ఆపై అజాగ్రత్త

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి


 పుల్‌కల్‌, జనవరి 13: విహారయాత్ర విషాదాంతమైంది. ముగ్గురి సరదా మూడు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ద్విచక్ర వాహనంపై సరదాగా మెదక్‌ నుంచి బయలుదేరి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. మెదక్‌కు చెందిన తౌఫిక్‌ (18), సమీర్‌ (18), జమీర్‌ (17) సింగూరు ప్రాజెక్టును చూసేందుకు మోటర్‌సైకిల్‌పై బయలుదేరారు. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లారు. గమ్యానికి చేరువలోకి వచ్చాక వేగం శ్రుతిమించడంతో.. వాహనం అదుపుతప్పి సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట దిగువ భాగంలో రహదారి పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో.. ముగ్గురు యువకులూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి.. గాయపడ్డ యువకులను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికితరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తౌఫిక్‌, సమీర్‌ మరణించగా, జమీర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి జమీర్‌ కూడా మృతిచెందాడు. అతి వేగం, అజాగ్రత్తే ముగ్గురి ఉసురు తీసిందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-14T07:57:08+05:30 IST