కేబుల్ బ్రిడ్జి పక్క ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-18T11:49:26+05:30 IST
మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతున్న
- మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన యువకులు
- చికిత్స పొందుతూ ఒకరు మృతి
హైదరాబాద్/మాదాపూర్ : మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతున్న యువకులు కేబుల్ బ్రిడ్జిని ఆనుకొని ఉన్న దుర్గంచెరువు ఫ్లైఓవర్ దిగుతూ డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసు్ఫగూడలో నివాసం ఉండే శివ(20), ప్రశాంత్, విజయ్ స్నేహితులు. బుధవారం రాత్రి ముగ్గురూ కలిసి మద్యం తాగారు.
తెల్లవారుజామున 3గంటలకు కేబుల్ బ్రిడ్జిని చూద్దామని రోడ్నెంబర్ 45 మీదుగా ద్విచక్రవాహనంపై బయల్దేరారు. కేబల్ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న ఫ్లైఓవర్ దిగుతున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో డివైడర్ను ఢీ కొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శివ మృతిచెందాడు. ఇతను సూరారంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రశాంత్, విజయ్ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు. మృతిచెందిన శివ కళ్లను దానం చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.