Rangareddy : పూటుగా మద్యం తాగి డ్రైవింగ్.. పండగపూట విషాదం..

ABN , First Publish Date - 2021-10-16T16:14:03+05:30 IST

జిల్లాలోని మొయినాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది...

Rangareddy : పూటుగా మద్యం తాగి డ్రైవింగ్.. పండగపూట విషాదం..

రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దసరా పండగ రోజు అతిగా మద్యం సేవించి వేగంతో బైక్ నడపడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి (36) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిజ్ నగర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే..

ఒరిస్సా నుంచి బతుకు దెరువుకోసం రంగారెడ్డి జిల్లాకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. పండుగ కావడంతో ఇద్దరు మిత్రులు పూటుగా మద్యం తాగి బైక్ డ్రైవ్ చేశారు. బైక్ అదుపు తప్పడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-10-16T16:14:03+05:30 IST