అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-31T01:30:58+05:30 IST
జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు
అనంతపురం: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బత్తలపల్లి మండలంలోని జ్వాలాపురం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను రెడ్డి, బాషా, అమ్మాజి, రేష్మగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.