కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-07T15:44:38+05:30 IST

పెండ్లిమర్రి మండలం, వెల్లటూరు పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

కడప జిల్లా: పెండ్లిమర్రి మండలం, వెల్లటూరు పెట్రోల్ బంకు దగ్గర గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడి కక్కడే మృతి  చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బైక్‌పై వచ్చినవారు వెల్లటూరు గ్రామంకు చెందిన వారుగా గుర్తించారు.

Updated Date - 2021-01-07T15:44:38+05:30 IST