కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-02-22T19:41:52+05:30 IST

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కురిక్యాల గ్రామానికి చెందిన కెంచ కనుకవ్వ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కనుకవ్వ శరీరంపై నుండి లారీ దూసుకెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రగాయాలైన కొమరయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-02-22T19:41:52+05:30 IST