సైడ్ నుంచి బస్సును ఢీకొట్టిన లారీ యువతి మృతి

ABN , First Publish Date - 2021-12-02T23:02:16+05:30 IST

శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసి బస్సును సైడ్ నుంచి మిని లారీ డీకొట్టింది.

సైడ్ నుంచి బస్సును ఢీకొట్టిన లారీ యువతి మృతి

కర్నూలు : శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసి బస్సును సైడ్ నుంచి మిని లారీ డీకొట్టింది. బస్సులో ఉన్న యువతి అక్కడిక్కడే మృతి చెందింది. యువతి మృతదేహం కిటికీలో వేలాడుతుంది. నరసరావుపేట నుంచి ఆర్‌టీసి  బస్సులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-02T23:02:16+05:30 IST