ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..

ABN , First Publish Date - 2022-04-24T12:56:49+05:30 IST

దాచేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరికేపల్లి గ్రామ సమీపంలో అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఆగివున్న లారీని జగన్ ట్రావెల్స్ బస్సు

ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..

గుంటూరు: దాచేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరికేపల్లి గ్రామ సమీపంలో అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఆగివున్న లారీని జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-04-24T12:56:49+05:30 IST