బైక్-ఆటో ఢీ... ఇద్దరు యువకులు మృతి
ABN , First Publish Date - 2021-09-19T01:31:23+05:30 IST
బైక్-ఆటో ఢీ... ఇద్దరు యువకులు మృతి
ప్రకాశం: జిల్లాలోని కందుకూరులోని అలావారి కళ్యాణమండపం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు రాజోలుపాడుకు చెందిన రాజేష్(17 ), విక్రం(21)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.