రహదారులకు మరమ్మతులు చేపట్టాలి: సీపీఎం
ABN , First Publish Date - 2020-10-22T07:15:04+05:30 IST
వైరా మండల పరిధిలోని ఆర్అండ్బీకి చెందిన జాతీయ ప్రధాన రహదారి అలాగే జగ్గయ్యపేట-మధిర రాష్ట్రీయ ప్రధాన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం రోడ్లపై నిరసన వ్యక్తం
వైరా, అక్టోబరు 21: వైరా మండల పరిధిలోని ఆర్అండ్బీకి చెందిన జాతీయ ప్రధాన రహదారి అలాగే జగ్గయ్యపేట-మధిర రాష్ట్రీయ ప్రధాన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు బొంతు రాంబాబు, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, చింతనిప్పు చలపతిరావు, గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, తూము సుధాకర్, సంక్రాంతి నర్సయ్య, అనుమోలు రామారావు, కృష్ణమాచారి, రాచబంటి భద్రమ్మ, రామకృష్ణ, మధు, ప్రసాద్, పౌలు పాల్గొన్నారు.