చందానగర్లో దోపిడీ
ABN , First Publish Date - 2021-07-31T02:50:47+05:30 IST
నగరంలోని చందానగర్లో దోపిడీ భారీ దోపిడీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగున్ని
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో భారీ దోపిడీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగున్ని ఇంట్లో కట్టేసి అగంతకులు ఇళ్లు గుళ్ల చేసారు. చందానగర్ పీఎస్ పరిధిలోని హుడా కాలనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీహర్ష ఉంటున్నాడు. శ్రీహర్ష ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మంచినీళ్లు కావాలని అడిగి శ్రీహర్ష పై దాడి చేసారు. శ్రీహర్షను చైర్లో కట్టిపడేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులను అగంతకులు దోచుకెళ్ళారు. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.