కోహ్లీ నిర్ణయంతో షాక్ అయ్యా: రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2022-01-16T23:36:41+05:30 IST

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి అనూహ్యంగా గుడ్‌బై చెప్పడంపై టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్

కోహ్లీ నిర్ణయంతో షాక్ అయ్యా: రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి అనూహ్యంగా గుడ్‌బై చెప్పడంపై టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘షాక్డ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్పందనను తెలియజేశాడు. కోహ్లీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. విజయవంతమైన ఇండియన్ కెప్టెన్‌ అని కొనియాడాడు. అతడి భవిష్యత్ మరింత బాగుండాలని ఆకాంక్షించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా సిరీస్‌ను 2-1తో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. 


ఈ టెస్టు ముగిసిన తర్వాతి రోజే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పటికే పలువురు తాజా, మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన రోహిత్.. కోహ్లీ నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు. కాగా, గాయం కారణంగా రోహిత్ దక్షిణాప్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ వన్డే జట్టుకు కూడా దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.

Updated Date - 2022-01-16T23:36:41+05:30 IST