జీఎంఆర్-గ్రూప్ ఏడీపీ డీల్కు సీసీఐ ఓకే
ABN , First Publish Date - 2020-02-22T07:06:10+05:30 IST
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రా, ఫ్రాన్స్కు చెందిన గ్రూప్ ఏడీపీకి మధ్య కుదిరిన వాటా విక్రయ ఒప్పందానికి
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రా, ఫ్రాన్స్కు చెందిన గ్రూప్ ఏడీపీకి మధ్య కుదిరిన వాటా విక్రయ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ విభాగం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో 49 శాతం వాటాను గ్రూప్ ఏడీపీకి విక్రయించేందుకు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (జీఐఎల్) గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.10,780 కోట్లు.