తెలంగాణకు రూ.599 కోట్ల విపత్తు నిధి
ABN , First Publish Date - 2020-10-22T07:18:10+05:30 IST
తెలంగాణకు రాష్ట్ర విపత్తుల స్పందన నిధి (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్-ఎ్సడీఆర్ఎఫ్) కింద రూ.599 కోట్లను 2020-21
తొలి వాయిదా కింద 224.50 కోట్లు విడుదల
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రాష్ట్ర విపత్తుల స్పందన నిధి (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్-ఎ్సడీఆర్ఎఫ్) కింద రూ.599 కోట్లను 2020-21 సంవత్సరానికి అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు లో కేంద్ర వాటా రూ.449 కోట్లు కాగా రాష్ట్ర వాటా రూ.150 కోట్లు కలిపి రూ.599 కోట్లను కేటాయించారు.
తొలి వాయి దా కింద ఇప్పటికే రూ.224.50 కోట్లను కేంద్రం విడుదల చే సింది. విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎ్ఫ మార్గదర్శకాల ప్రకారం నిధులను వినియోగించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.