ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్టీసీ సేవలు
ABN , First Publish Date - 2020-05-23T08:41:15+05:30 IST
హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించనుంది. నేటి నుంచి హైదరాబాద్లో
- హైదరాబాద్లో నేటి నుంచి 32 మార్గాల్లో ప్రారంభం
హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించనుంది. నేటి నుంచి హైదరాబాద్లో 32మార్గాల్లో బస్సు సదుపాయం అందుతుంది. ఉద్యోగులు ఐడీ కార్డు చూపితేనే బస్సులోకి అనుమతిస్తారు. ఉద్యోగులు తమ కార్యాలయాలకు వచ్చేందుకు బస్సులను అనుమతించినందుకు సీఎం కేసీఆర్కు, సీఎస్ సోమేశ్ కుమార్కు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు కారం రవీందర్రెడ్డి, మామిళ్ల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.