భారత షట్లర్ సాయి ప్రణీత్‌కు కరోనా

ABN , First Publish Date - 2021-01-20T16:32:51+05:30 IST

భారత షట్లర్ బి సాయి ప్రణీత్‌కు కరోనా సోకింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ...

భారత షట్లర్ సాయి ప్రణీత్‌కు కరోనా

థాయ్‌లాండ్ ఒపెన్‌కు‌ దూరం

బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : భారత షట్లర్ బి సాయి ప్రణీత్‌కు కరోనా సోకింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటానని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది. కరోనా సోకడం వల్ల సాయి ప్రణీత్ టయోటా థాయిలాండ్ ఓపెన్ నుంచి వైదొలిగినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేసినా పోటీ నుంచి వైదొలిగారు. సాయి ప్రణీత్ ఉన్న హోటల్ లో కిడాంబి శ్రీకాంత్ తో కలిసి గడిపినట్లు బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. దీంతో కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం కిడాంబి శ్రీకాంత్ థాయ్ లాండ్ ఒపెన్ పోటీ నుంచి వైదొలిగి స్వీయ నిర్బంధంలో ఉన్నారని క్రీడాపాలకమండలి వెల్లడించింది. కిడాంబికి కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో తేలినా క్వారంటైన్ చేశారు. గత వారం కిడాంబి కండరాల ఒత్తిడి కారణంగా థాయ్ లాండ్ పోటీ నుంచి వైదొలిగారు. 

Updated Date - 2021-01-20T16:32:51+05:30 IST