మోదీ, జగన్పై మండిపడ్డ శైలజానాథ్
ABN , First Publish Date - 2021-04-30T00:04:31+05:30 IST
ప్రధాని మోదీ, సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ప్రధాని మోదీ, సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రధాని, సీఎం కలుగుల్లో దాక్కున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొంటే వీరు కేవలం ప్రవచనాలతో సరిపుచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసమర్థ ప్రధాని, చేతగాని ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. గొప్పలకు పోయి 80 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి దేశ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆయన తప్పుబట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసి నీతులు చెప్పడం మోదీకే చెల్లిందన్నారు. ఇల్లు తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తిలా ప్రధాని, సీఎం తీరు ఉందని శైలజానాథ్ దుయ్యబట్టారు.