కొత్త మోడల్లో Samsung గెలాక్సీ M21 స్మార్ట్ఫోన్
ABN , First Publish Date - 2021-07-21T22:09:27+05:30 IST
కొత్త మోడల్లో Samsung గెలాక్సీ M21 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది. భారత మార్కెట్లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండే శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ వెల్లడించింది. జూలై 26 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499 ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.