కడప కలెక్టరేట్ ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2021-01-19T17:59:34+05:30 IST
కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు
కడప : కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో తాము తొమ్మిది నెలలపాటు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహించామన్నారు. క్లిష్ట సమయంలో విధులు నిర్వహించిన తమను విధుల నుంచి అకారణంగా తొలగించడం సిగ్గు చేటన్నారు.
నగర కమిషనర్ లవన్న పనిగట్టుకుని పారిశుధ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగాలు లేక కుటుంబాలు పోషించుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. ఉద్యోగాల తొలగింపుతో తాము బజారున పడ్డామన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.