క్రియాశీలకంగా ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో అవకాశమివ్వాలి: సత్యవతి

ABN , First Publish Date - 2021-09-05T22:11:31+05:30 IST

టీఆర్ఎస్‌ గ్రామ, మండల, పట్టణ కమిటీలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు.

క్రియాశీలకంగా ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో అవకాశమివ్వాలి: సత్యవతి

హైదరాబాద్: టీఆర్ఎస్‌ గ్రామ, మండల, పట్టణ కమిటీలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రియాశీలకంగా ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో అవకాశమివ్వాలన్నారు. కమిటీల్లో అవకాశం రానివారికి భవిష్యత్‌లో అవకాశాలుంటాయని తెలిపారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలకు అధిష్టానం రూ.18 కోట్ల బీమా చేయించిందని తెలిపారు. విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సత్యవతి సూచించారు.


Updated Date - 2021-09-05T22:11:31+05:30 IST