గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన సీతక్క

ABN , First Publish Date - 2020-08-09T09:12:46+05:30 IST

ప్రముఖ సింగర్‌ స్మిత విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి.. అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను ఎమ్మెల్యే సీతక్క నాటారు. అనేక సంవత్సరాల పాటు తనకు...

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన సీతక్క

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సింగర్‌ స్మిత విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి.. అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను ఎమ్మెల్యే సీతక్క నాటారు. అనేక సంవత్సరాల పాటు తనకు.. అడవి, అందులోని చెట్లే నీడనిచ్చాయని, ఆ చెట్లతో తనకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని సీతక్క అన్నారు. కుండీలలోనే కాకుండా ఇంటి ఆవరణలో కూడా మొక్కలను పెంచాలని సూచించారు. కాగా, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-09T09:12:46+05:30 IST