ఓం ఫినిషాయ నమః.. ధోనీపై సెహ్వాగ్ ట్వీట్!

ABN , First Publish Date - 2020-08-16T04:07:04+05:30 IST

మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

ఓం ఫినిషాయ నమః.. ధోనీపై సెహ్వాగ్ ట్వీట్!

న్యూఢిల్లీ: మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ధోనీలాంటి మరో ఆటగాడు దొరకడం అసంభవమని సెహ్వాగ్ చెప్పాడు. ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారుగానీ ధోనీకంటే ప్రశాంతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరని స్పష్టంచేశాడు. ‘ధోనీలాంటి ఆటగాడు దొరకడం మిషన్ ఇంపాజిబుల్. అలాంటి ఆటగాడు మరొకడు లేడు, ఉండడు, రాడు. ఓం ఫినిషాయ నమః’ అంటూ తన స్టైల్లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-08-16T04:07:04+05:30 IST