రైల్వే ఉద్యోగులకు మాస్కులు అందజేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్

ABN , First Publish Date - 2020-03-30T16:17:35+05:30 IST

మహబూబాబాద్: ఇంజినీరింగ్ విభాగంలో అత్యవసర సేవలు చేస్తున్న ఉద్యోగులకు మహబూబాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శంకర్ మాస్కులు అందజేశారు.

రైల్వే ఉద్యోగులకు మాస్కులు అందజేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్

మహబూబాబాద్: ఇంజినీరింగ్ విభాగంలో అత్యవసర సేవలు చేస్తున్న ఉద్యోగులకు మహబూబాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శంకర్ మాస్కులు అందజేశారు. శానిటైజర్, హ్యాండ్ వాష్ సోప్‌లను సైతం ఆయన అందజేశారు.


ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు నిత్యం రైల్వే గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా జరుగుతోందన్నారు. గూడ్స్ రైళ్లు నడవడంలో ఇంజినీరింగ్ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని వెల్లడించారు. ప్రతి రైల్వే ఉద్యోగి ఈ విపత్కర పరిస్థితుల్లో తన వంతు కర్తవ్యం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు శంకర్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-03-30T16:17:35+05:30 IST