శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2021-08-23T11:42:58+05:30 IST
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు ఆదివారం విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. 6ఇ8108 నంబర్ గల సర్వీసు శంషాబాద్ విమానాశ్రయం
శంషాబాద్, ఆగస్టు 22: శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు ఆదివారం విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. 6ఇ8108 నంబర్ గల సర్వీసు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.50 గంటలకు శంషాబాద్కు చేరుకుంటుందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, మంగళ, గురు, ఆదివారాల్లో ఈ విమాన సేవలు అందనున్నాయి. అక్టోబరు 15 నుంచి వారానికి 4 రోజులు సేవలందిస్తామని అధికారులు తెలిపారు.