పంత్‌ను ఎగతాళి చేసిన దిగ్గజ స్పిన్నర్.. రెచ్చిపోయిన నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-01-17T01:05:28+05:30 IST

ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టు హీరోల్లో ఒకడైన భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఎగతాళఇ చేశాడు. బ్రిస్బేన్ టెస్టులో వికెట్ కీపింగ్ చేసే సమయంలో పంత్ ఓ రకం సన్‌గ్లాసెస్ పెట్టుకున్నాడు.

పంత్‌ను ఎగతాళి చేసిన దిగ్గజ స్పిన్నర్.. రెచ్చిపోయిన నెటిజన్లు!

బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టు హీరోల్లో ఒకడైన భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఎగతాళఇ చేశాడు. బ్రిస్బేన్ టెస్టులో వికెట్ కీపింగ్ చేసే సమయంలో పంత్ ఓ రకం సన్‌గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న వార్న్.. ‘సర్వీస్ స్టేషన్ నుంచి నేరుగా వచ్చినట్లున్నాయ్’ అంటూ కామెంట్ చేశాడు. ఇది విన్న నెటిజన్లు ఊరుకుంటారా? తన కెరీర్‌లో వార్న్ ఎప్పుడెప్పుడు వింత సన్‌గ్లాసెస్ వాడాడో ఆ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేశారు. ఓ జర్నలిస్టు వార్న్ కామెంట్‌పై స్పందిస్తూ.. షేన్ వార్న్ రకరకాల సన్‌గ్లాసెస్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ‘ఇలాంటి వార్న్‌.. వేరే వాళ్ల ఇష్టాయిష్టాలపై కామెంట్ చేస్తాడా? ఎంత ధైర్యం?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు.

Updated Date - 2021-01-17T01:05:28+05:30 IST