ట్రైనింగ్ మొదలుపెట్టినందుకు విచారణ ఎదురుకోనున్న శార్ధూల్

ABN , First Publish Date - 2020-05-31T16:25:30+05:30 IST

లాక్‌డౌన్ నాలుగో దశలో ఉండగా.. ట్రైనింగ్ ప్రారంభించిన టీం ఇండియా పేస్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలో విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీ

ట్రైనింగ్ మొదలుపెట్టినందుకు విచారణ ఎదురుకోనున్న శార్ధూల్

లాక్‌డౌన్ నాలుగో దశలో ఉండగా.. ట్రైనింగ్ ప్రారంభించిన టీం ఇండియా పేస్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలో విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీ స్టేడియంలలో ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శార్ధూల్ తనతో పాటు మరో ముగ్గురు క్రికెటర్లతో బహిరంగంగా ప్రాక్టీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రాక్టీస్‌కు అప్పటికీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో శార్ధూల్ ప్రాక్టీస్ ప్రారంభించడం అతనికి సమస్యను తెచ్చి పెట్టింది. 


బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాడు అయిన శార్ధూల్ బోర్డు నిబంధనలు పాటించాలి. కానీ, నిబంధనలు అతిక్రమించడంతో అతన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణలో శార్ధూల్‌తో పాటు ప్రాక్టీస్‌కి వెళ్లిన ఇతర క్రికెటర్లు కూడా హాజరుకావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-05-31T16:25:30+05:30 IST