రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు: షర్మిల

ABN , First Publish Date - 2022-01-27T19:20:57+05:30 IST

రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు.

రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు: షర్మిల

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ దేశాన్ని ఏలుతారంటే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి ఉన్న అన్ని రకాల సబ్సిడీలను తీసేశారని.. రైతులపై కేసీఆర్‌కు ఎందుకింత వివక్ష అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసుకు పరిమితం లేకుండా రైతులకు భీమా వర్తింపజేయాలన్నారు. యూపీలో కేసీఆర్ ప్రచారం అనేది పెద్ద జోక్‌గా అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణలో ఏం చేశారని పక్క రాష్ట్రాలకు పోతారని షర్మిల పేర్కొన్నారు.





Updated Date - 2022-01-27T19:20:57+05:30 IST