శిఽథిల భవనాన్ని తొలగించేదెన్నడో..?

ABN , First Publish Date - 2021-02-25T04:31:40+05:30 IST

సత్తుపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని చెరుకుపల్లి అంగన్‌వాడీ భవనం మూసివేసి ఏడాదిన్నర కావస్తుంది.

శిఽథిల భవనాన్ని తొలగించేదెన్నడో..?
ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

సర్పాలకు నిలయంగా అంగన్‌వాడీ భవనం

 ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు

సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 24 : సత్తుపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని చెరుకుపల్లి అంగన్‌వాడీ భవనం మూసివేసి ఏడాదిన్నర కావస్తుంది. భవనం శిఽథిలం కావడంతో ముందస్తుగా కేంద్రాన్ని మూసివేసి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ భవనాన్ని కూల్చి వేయకుండా అలాగే ఉంచడంతో పిచ్చిమొక్కలు పెరిగి సర్పాలకు నిలయంగా మారింది. చుట్టుపక్కల చిన్నారులు ఆటాడుకునేందుకు వెళ్తుండటంతో పాటు సమీపంలోని ప్రజలు అభద్రతా భావంతో నివశిస్తున్నారు. వెంటనే భవనాన్ని కూల్చివేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇదే విషయమై ఐసీడీఎస్‌ సీడీపీవో కొండమ్మను వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను రికార్డులు పరిశీలించడంలో బిజీగా ఉన్నానని, తర్వాత ఫోన్‌ చేస్తానని కాల్‌ కట్‌చేశారు.

తనకు సమాచారం లేదు{ చిట్యాల సుభాషిణీ, ఎంపీడీవో, సత్తుపల్లి

చెరుకుపల్లి గ్రామంలో శిధిలమైన అంగన్‌వాడీ కేంద్రం భవనం విషయం నాకు తెలియదు. పంచాయతీ సెక్రటరీని పరిశీలించమని ఆదేశిస్తాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో భవనాన్ని కూల్చివేయవచ్చు.


Updated Date - 2021-02-25T04:31:40+05:30 IST