ఏపీ హైకోర్టును వెంటనే కర్నూలుకు తరలించాలి: కారెం శివాజీ
ABN , First Publish Date - 2021-10-30T18:02:40+05:30 IST
అమరావతిలో ఉన్న హైకోర్టును వెంటనే కర్నూలుకు తరలించాలని మాల మహానాడు నాయకుడు కారెం శివాజీ అన్నారు.
కర్నూలు: అమరావతిలో ఉన్న హైకోర్టును వెంటనే కర్నూలుకు తరలించాలని మాల మహానాడు నాయకుడు కారెం శివాజీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూల్ టు విజయవాడ సిక్స్ లైన్ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు వెంటనే రుణాలు అందించాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ చెరువులు కుంటలు తవ్వించి నీటి నీ నింపాలని కారెం శివాజీ అన్నారు.