జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్

ABN , First Publish Date - 2020-06-02T20:58:25+05:30 IST

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. దివాకర్ ట్రావెల్స్‌పై మరోసారి ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు

జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్

అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. దివాకర్ ట్రావెల్స్‌పై మరోసారి ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. బుక్కరాయసముద్రం సమీపంలో నాలుగు టిప్పర్ వాహనాలలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనే 57 వాహనాలను రవాణా శాఖ సీజ్ చేసింది. తాజాగా సీజ్ చేసిన వాహనాలను అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి అధికారులు తరలించారు. 


Updated Date - 2020-06-02T20:58:25+05:30 IST