విస్తరణబాటలో సిద్స్ ఫామ్స్
ABN , First Publish Date - 2022-01-19T05:50:14+05:30 IST
బెంగళూరు కు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో రోజుకు
హైదరాబాద్కు చెందిన సిద్స్ ఫామ్స్.. బెంగళూరుకు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో రోజుకు 23 వేల లీటర్లకు పైగా పాలను సరఫరా చేస్తోంది. త్వరలోనే సంస్థ కార్యకలాపాలను బెంగళూ రు సహా దాని సమీప ప్రాంతాలకు విస్తరించనున్నట్లు సిద్స్ ఫామ్స్ వ్యవస్థాపకుడు కిశోర్ ఇందుకూరి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం 300గా ఉన్న స్టోర్ల సంఖ్యను 1,500కు పెంచాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే డిమాండ్కు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచటంతో పాటు డెలివరీ చెయిన్పై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు నిష్ణాతులైన నిపుణులను నియమించుకున్నట్లు తెలిపారు.